Sunday 15 January 2017

శ్రధ్ధ


నిన్న నేను తర్పణములు వదులుకొని, మడితో కాకికి అన్నం, వడ పెట్టాను అపార్టుమెంటులో పైన.
ఈ కార్యక్రమం అంతా ఓ 35 ఏండ్ల అమ్మాయి చూస్తూ వున్నది....నా దగ్గరకు వచ్చి అడిగింది...
" అయ్యా, నమస్కారములు ...మా అమ్మా నాన్నలు చనిపోయినారు ....అన్నదమ్ములు లేరు...
పెళ్లి అయినది ....మా అమ్మా నాన్నలకు మేము ఏ కర్మ కాండ పెద్దగా చేయలేదు....నా భర్తకు ఇవన్నీ నమ్మకం లేవు....మా అమ్మా నాన్నలకు నేను ఏ విధముగా ఇవన్నీ చేయగలను....నా తల్లిదండ్రులకు నేను ఏమీ చేసుకోలేనా? నాకు పిల్లలు లేరు....ఏం చేయమంటారు స్వామీ".... అని

కళ్లల్లో నీళ్లు తిరిగినాయి నాకు....
అమ్మా అన్నం వండినావా? మీరు తిన్నారా అని అడిగాను....
లేదండీ ఇంకా తినలేదు....
వెళ్లి ఓ పళ్ళెం లో అన్నం పట్టుకా రా తల్లీ.....
వెళ్లి పది నిమిషాలలో ఆ అమ్మాయి అన్నం పట్టుకొని వచ్చింది....
అమ్మా అక్కడ పెట్టి, దక్షిణ దిక్కు తిరిగి, మీ అమ్మా నాన్నలను గట్టిగా పిలువు తల్లీ...అన్నాను...
మనసులో ప్రార్ధన చేసి....అమ్మా, నాన్నా అని మూడు సార్లు పిలిచింది.....వెంటనే కాకులు వచ్చినాయి....కానీ ఎంతసేపటికీ ముట్టవు......అరగంట అయింది....ఈ పిల్ల ఏమో ఏడుస్తుంది...
ఏమండీ ఎందుకు తినలేదు అని అడుగుతుంది నన్ను....
ఓ సారి నేను కళ్లు మూసుకొని ఆలోచించి....ఇలా చెప్పు అమ్మా అన్నాను....
" అమ్మా- నాన్నా నా తప్పులన్నీ క్షమించి, మన్నించి అన్నం తినండమ్మా "....అని...
అంతే మరుక్షణం లో కాకులు  అన్నీ వచ్చి తినిపోయినాయి....
ఈ అమ్మాయి బోరున ఏడ్చి నా కాళ్ల మీద పడింది....
అప్పుడు చెప్పింది.....నేను ప్రేమించి పెళ్లి చేసపకొన్నానండీ....మా వాళ్లు ఆ దిగులుతో మరణించారని.
ప్రతి రోజూ కాకులకు అన్నం పెట్టు తల్లీ అని దీవించి పంపాను.....
ఇదుగో ఆ అమ్మాయి ఫోను చేసింది ఇప్పుడే......రాత్రి కలలో వాళ్ల అమ్మా నాన్నలు కనిపించారంట....
పై సంక్రాతికి నీకు పిల్లలు తప్పక పుడతారమ్మా అని దీవించాను.....
మాట ఇచ్చాను....ఇక నిలబెట్టడం అమ్మ వంతు.....
భాస్కరానంద నాథ...15-01-2017